YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎం జగన్ కు దేవినేని ఉమా బహిరంగ లేఖ

సీఎం జగన్ కు దేవినేని ఉమా బహిరంగ లేఖ

విజయవాడ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మాజీ మంత్రి, టిడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు బహిరంగ లేఖ విడుదల చేశారు. వ్యవసాయం, సాగునీటి రంగాలను జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. దసరా వస్తున్న రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వని దద్దమ్మ, చెతగాని ప్రభుత్వమని అన్నారు. మూడు సంవత్సరాలు పూర్తి కాకుండానే రాష్ట్రాన్ని ముద నష్టం చేసేశారని తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన దిక్కుమాలిన ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తాడేపల్లిలో కూర్చొని తద్దిణాలు, వర్ధంతి, పుట్టినరోజులు, చెత్త బండ్లకు జెండాలు ఊపుతున్నారన్నారు. పేదవాడి ముద్దను బ్లాక్ మార్కెట్ లాగేసుకుంటోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలను దోచుకుంటున్నారని దేవినేని లేఖలో పేర్కొన్నారు.

Related Posts