ఎడమ కాలువకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలని జానా చేసిన డిమాండ్ హస్యాస్పదం. బహుశా కోసిన పంట మెదళ్ళకు జానారెడ్డి నీరు అడిగి ఉండవచ్చు నేమో నని రాష్ట్ర విద్యుత్, యస్ సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.. మంగళవారం నాడు నాగార్జునసాగర్ నియోజక వర్గం పరిధిలోని పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, సిపియం నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెరాసాలో చేరారు. అనంతరం గ్రామంలో మంత్రి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ వరుసగా 7 సవత్సరాలు ఎడమ కాలువ కింద భూములను ఎండపెట్టి ఆంధ్రాకు నీరిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ దీ. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ముమ్మాటికి ఆంధ్రా పార్టీలే నని విమర్శించారు. ఇప్పడిప్పుడే తెలంగాణ ప్రజల కల సాకారమౌతుంది. టేల్-ఎండ్ అనుకున్న భూములకు వరసగా రెండో సంవత్సరం రెండో పంటకు నీరిచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ ది. పదవుల కోసం సీమాంద్రా నేతలకు తెలంగాణాను తెలింగాణాన తాకట్టు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలదని అయన మండిపడ్డారు. ఆ పార్టీలకు ఇక పై తెలంగాణాలో చోటుండదని అయన అన్నారు.