YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

హ‌త్య‌ల‌తో నిర‌స‌న‌కారుల నోళ్లు మూయించ‌లేరు: వ‌రుణ్ గాంధీ

హ‌త్య‌ల‌తో నిర‌స‌న‌కారుల నోళ్లు మూయించ‌లేరు: వ‌రుణ్ గాంధీ

న్యూఢిల్లీ అక్టోబర్ 7
ల‌ఖీంపూర్ ఖేరీ ఘ‌ట‌న‌పై మొద‌టి నుంచీ బీజేపీ ఎంపీ అయిన‌ వ‌రుణ్ గాంధీ తీవ్రంగానే స్పందిస్తున్నారు.  హ‌త్య‌ల‌తో నిర‌స‌న‌కారుల నోళ్లు మూయించ‌లేరు అని గురువారం ఉద‌యం ఆయ‌న ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతోపాటు ఆయ‌న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన స్ప‌ష్ట‌మైన వీడియోను షేర్ చేశారు. ఇందులో వెనుక వేగంగా వ‌చ్చిన థార్ వాహ‌నం రైతుల‌ను తొక్కుకుంటూ వెళ్ల‌డం చూడొచ్చు. ఆ వెంటే మ‌రో ఎస్‌యూవీ వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో బిత్‌ూర‌పోయిన రైతులు భ‌యాందోళ‌న‌ల‌కు గురై అటూఇటూ ప‌రుగెత్త‌డం ఈ వీడియోలో చూడొచ్చు.ఈ వీడియోనే వ‌రుణ్ గాంధీ సాక్ష్యంగా చూపిస్తూ.. వీడియోలో స్ప‌ష్టంగా తేలిపోయింది. హ‌త్య‌ల‌తో నిర‌స‌న‌కారుల నోళ్లు మూయించ‌లేరు. అమాయ‌క రైతుల ర‌క్తం క‌ళ్ల చూసిన వారిని బాధ్యుల‌ను చేయాలి. ఈ క్రూర‌త్వం, అహంకారానికి సంబంధించిన సందేశం రైతుల మెద‌ళ్ల‌లోకి వెళ్ల‌క ముందే న్యాయం జ‌ర‌గాలి అని ట్వీట్ చేశారు. మంగ‌ళ‌వారం కూడా ఈ ఘ‌ట‌నకు సంబందించిన వీడియోను షేర్ చేస్తూ.. బాధ్యుల‌ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

Related Posts