వోటుకు నోటు కేసుకు సంబంధించి జేరూసలేం మత్తయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రేమతో కేసీఆర్ కు పది ప్రశ్నలు సంధించారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరి ప్రమేయం దర్యాప్తు జరపాలి. అదికుడా సీబీఐ దర్యాప్తు జరపాలని అన్నారు. నా తమ్ముడిని, బంధువులను ఉప్పల్ పోలీసులతో కొట్టించిన దానిపై దర్యాప్తు జరపాలని అయన అన్నారు. క్రిస్టియన్ నామినేటేడ్ ఎమ్మెల్యేను ఎందుకు బలిపశువు చేశారని ప్రశ్నించారు. ఏసీబీ చట్టప్రకారం చేసిన స్టింగ్ ఆపరేషన్లో ..కోర్టుకు పంపాల్సిన వీడియోలు మీడియాకు ఎందుకిచ్చారు. అందుకు ఏసీబీ పై చర్యలేవని అడిగారు. నన్ను కోవర్టుగా మార్చేందుకు కేటీఆర్ గన్మెన్లు కొనాలని యత్నించారు. వారి మాట విననందుకు బెదిరించారు. ఫోన్ ట్యాపింగ్ వివరాలు ఆర్టీఐ ద్వారా కోరిన ఎందుకు ఇవ్వలేదని అన్నారు. నాపై కొట్టేసిన కేసును రీఓపెన్ చేసి నిజనిజాలు తెలుసుకోవాలని మత్తయ్య డిమాండ్ చేసారు.