YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కెసిఆర్ బొమ్మతో ముద్రించిన నాణేలను ఆవిష్కరించిన కెసిఆర్

 కెసిఆర్ బొమ్మతో ముద్రించిన నాణేలను ఆవిష్కరించిన కెసిఆర్

ముఖ్య మంత్రి కెసిఆర్ బొమ్మతో ముద్రించిన నాణేలను స్వయంగా కేసీఆరే ఇవాళ ఆవిష్కరించారు. కేసీఆర్ పై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ నాణేలకు ఒక వైపు కేసీఆర్ చిత్రాన్ని, మరో వైపు పార్టీ గుర్తు కారు బొమ్మను ముద్రించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ నాణేల ఆవిష్కరణ కార్యక్రమంలో కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

కోర్ కమిటి మెంబర్ సురేష్ గోపతి మాట్లాడుతూ.. కేసీఆర్ పైఉన్న అభిమానంతోనే ఈ నాణేలను తయారు చేయడం జరిగిందన్నారు. ఈ నాణేలను సీఎం కేసీఆర్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. కోర్ కమిటి మెంబర్ భాస్కర్ మొట్ట మాట్లాడుతూ.. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో విందు తరువాత జరిగిన మీటింగ్ లో ఆయన ఎన్ఆర్ఐల బాగోగులను అడిగి తెలుసుకోవడం గొప్పగా అనిపించింది అన్నారు. సిక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పుల కోసం ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్న సీఎం కేసీఆర్ కు తమ మద్దతు పూర్తిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

 

Related Posts