YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

తండ్రిని హతమార్చిన తనయుడు

తండ్రిని హతమార్చిన తనయుడు

ఆస్తి కోసం కన్న తండ్రినే హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని బండారుపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం బండారుపల్లి గ్రామానికి చెందిన కళ్ళే  పాపయ్య (80) కు ఐదుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు సంతానం. పాపయ్య పిల్లలందరికీ వివాహాలు అవడంతో ఇతర ప్రాంతాలలో నివాసం ఉంటున్నారు.పాపయ్య కు సొంత ఇల్లు ఉండటంతో పాపయ్య భార్యతో ఓ గదిలో,పెద్ద కుమారుడు ఓ గదిలో చిన్న కుమారుడు మరో గదిలో నివాసముంటున్నారు. చిన్న కుమారుడైన నారాయణ మద్యానికి బానిసై తరచూ ఆస్తిని తన పేర వ్రాయాలని తల్లిదండ్రులతో గొడవ పడ సాగాడు మద్యం తాగిన ప్రతిసారి ఇంటిని తన పేర రాయాలని తల్లిదండ్రులతో గొడవ పడుతూ ఉన్నాడు.ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మద్యం సేవించిన నారాయణ తండ్రి తో గొడవపడి పాపయ్యను పైకిఎత్తి  కింద పడవేయడంతో పాపయ్య తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడికొండ ఎస్ఐ వెంకటాద్రి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి నిందితుడైన నారాయణ స్టేషన్ కు తరలించారు.

Related Posts