YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీ పార్టీకి రైతులు ఝలక్

గులాబీ పార్టీకి రైతులు ఝలక్

వరంగల్,
టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ప‌ది లక్షల మందితో నిర్వహించాలనుకుంటున్న విజ‌య గర్జన స‌భ‌కు స్థల సేక‌ర‌ణ సమస్యగా మారింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో విజ‌య‌గ‌ర్జన స‌భ నిర్వహించాలని వ‌రంగ‌ల్ జిల్లా నేత‌లు నిర్ణయించారు. ఈక్రమంలోనే అక్కడ కొన్ని పనులకు ఉపక్రమించారు. బుధ‌వారం స‌భ స్థలాన్ని ప‌రిశీలించేందుకు మాజీ ఉప‌ ముఖ్యమంత్రి క‌డియం శ్రీహ‌రి, ప్రభుత్వ చీఫ్‌ విప్ విన‌య్‌ భాస్కర్, ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్‌ల‌తోపాటు పార్టీ నేత‌లు టోల్‌గేట్‌కు స‌మీపంలోని పొలాల్లోకి చేరుకున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న స్థానిక రైతులు వారిని అడ్డుకున్నారు.తమకు సమాచారం ఇవ్వకుండానే తమ భూముల్లో ఎలా పనులు చేస్తారంటూ టీఆర్‌ఎస్ నేతలను రైతులు నిలదీశారు. ఎమ్మెల్యేలు, స్థానిక నేత‌ల‌తో క‌ల‌సి రెండ్రోజులుగా తమ భూములు ఇవ్వాల‌ని ఒత్తిడి చేస్తున్నార‌ని వారు ఆరోపించారు. బ‌హిరంగ స‌భ‌కు తమ భూములు ఇవ్వబోమని ఆందోళన చేపట్టారు.టీఆర్ఎస్‌ సభ కోసం పంటలు పండే తమ పొలాలను ఎట్టి పరిస్థితిల్లో ఇచ్చేది లేదని అక్కడి రైతులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలను అడ్డుకోబోయిన రైతుల‌ను పోలీసులు పక్కకు లాగేశారు. దీంతో రైతుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింది. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Related Posts