YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అటెన్షన్...అంతా కుప్పం మీదే

అటెన్షన్...అంతా కుప్పం మీదే

తిరుపతి, నవంబర్ 6
ఏపీ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. ఇప్పుడు స్టేట్ అటెన్షన్ మొత్తం.. కుప్పం మీదే ఉంది. కుప్పంలో రాజకీయం కుత కుత ఉడికిపోతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతుండడంతో.. ఏపీ ఫోకస్ అంతా అక్కడికే షిఫ్ట్ అయ్యింది. ఇప్పటికే.. టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.  విమర్శలు.. ప్రతి విమర్శలు.. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో కుప్పంలో పొలిటికల్ హీట్ పెరిగుతోంది. కుప్పం బహిరంగసభలో.. మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబుపై విమర్శలు  గుప్పించారు. తనను కుప్పంకు రావొద్దని చెప్పేందుకు.. చంద్రబాబుకు ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. 35 ఏళ్లుగా కుప్పం నుంచి గెలుస్తున్న బాబు.. ఇక్కడి ప్రజలకు  చేసిందేమీ లేదన్నారు. ఉపాధి లేక కుప్పం నుంచి 25 వేల మంది వలస వెళ్లిపోయారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎలక్షన్  జరిగే లోగా.. కుప్పానికి హంద్రీ-నీవా నీళ్లు తెస్తామన్నారు.ఇక.. 14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేశ్పై జరిగిన దాడి.. కుప్పంలో ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసింది.  దుండగులు అతని నామినేషన్ పత్రాలను కూడా లాక్కెళ్లారు. ఈ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు లేఖ రాశారు. వైసీపీకి చెందిన 30 మంది వెంకటేశ్ని కొట్టారని ఆరోపిస్తూ.. దాడికి సంబంధించిన ఫోటోలను లేఖకు జత చేసి పంపారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. ముప్పు పొంచి ఉన్న అభ్యర్థులకు భద్రత కల్పించాలన్నారు. తక్షణమే కుప్పం ఎన్నికల్లో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్  చేశారు. ఇక.. కుప్పం మున్సిపాలిటీపై ఎగిరేది తమ జెండానే అని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభలో వైసీపీ ఎంపీ రెడ్డప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.  తాము ఓడితే.. వైసీపీ నేతలెవరూ కుప్పంలో అడుగుపెట్టబోమన్నారు. అదే.. టీడీపీ ఓడితే చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సవాల్ విసిరారు.  చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు, ఓటర్ లిస్ట్ లో పేరు కూడా లేదన్నారు. కుప్పంలో ఉన్న 25 వార్డులకు 125కు పైనే నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపాలిటీ ఎన్నికల  బాధ్యతలను.. టీడీపీ తరఫున పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చూస్తున్నారు. వైసీపీ తరఫున ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యే వెంకటగౌడ పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ  మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా త్రిలోక్ బరిలోకి దిగుతుండగా.. వైసీపీ తరఫున డాక్టర్ సురేశ్ ఉన్నారు.

Related Posts