YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పేద‌రికం పేగుబంధం.....

పేద‌రికం పేగుబంధం.....

ముంబై నవంబర్ 10
పేద‌రికంతో త‌ల్ల‌డిల్లిన త‌ల్లి మూడు రోజుల ప‌సికందైన త‌న క‌న్న‌కొడుకును ముంబైలోని ఓ వ్య‌క్తికి రూ 1.78 ల‌క్ష‌ల‌కు అమ్మిన ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లా షిర్డీలో వెలుగుచూసింది. ఈ ఘ‌ట‌న‌లో మ‌హిళ‌తో పాటు ఆమెకు స‌హ‌క‌రించిన న‌లుగురితో పాటు శిశువును కొనుగోలు చేసిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. డొంబివిలిలోని మ‌న్ప‌డ పోలీస్ స్టేష‌న్‌లో న‌వంబ‌ర్ 7న దాఖ‌లైన ఎఫ్ఐఆర్ ప్ర‌కారం..సెప్టెంబ‌ర్‌లో మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ త‌మ కుటుంబం పేద‌రికంలో మ‌గ్గుతుండ‌టంతో శిశువును పోషించ‌లేక‌పోయింది.దీంతో శిశువును విక్ర‌యించి సొమ్ము చేసుకునేందుకు ఆమె త‌గిన క‌స్ట‌మ‌ర్ కోసం వెతుకుతోంది. ఈ విష‌యంలో అహ్మ‌ద్‌న‌గ‌ర్‌, థానేకు చెందిన క‌ళ్యాణ్‌, ముంబైలోని ములుంద్‌కు చెందిన ముగ్గురు మ‌హిళ‌లు ఆమెకు స‌హ‌క‌రించారు. ములుంద్‌లో నివ‌సించే వ్య‌క్తికి ఎలాంటి చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన లాంఛ‌నాలు పూర్తిచేయ‌కుండానే వారు రూ 1.78 ల‌క్ష‌ల‌కు శిశువ‌ను విక్ర‌యించారు. ఈ విష‌య‌మై స‌మాచారం అందడంతో వ్య‌క్తి ఇంటిపై దాడులు చేప‌ట్టగా శిశువు క‌నిపించాడు. దీంతో నేరానికి పాల్ప‌డిన ప‌సిబిడ్డ త‌ల్లి స‌హా న‌లుగురు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Posts