YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంత్రి అవంతి ఇంటిముందు అందోళన

మంత్రి అవంతి ఇంటిముందు అందోళన

విశాఖపట్నం
విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ వాహనం ఢీకొనడంతో సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి నివాసం ముందు నిరసనకు దిగారు. మంగళవారం  సీఎం కాన్వాయ్లో ఎయిర్పోర్టు నుంచి వస్తుండగా మంత్రి వాహనం ఢీకొనడం తోనే సూర్యనారాయణ మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. సీసీ పూటేజీలో మంత్రి వాహనమే ఢీ కొట్టినట్లు చూసామని  బంధువులు వెల్లడించారు. తమ కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.  మృతుడు సూర్యనారాయణ స్వస్థలం విజయ నగరంజిల్లా గజపతినగరం. మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళనతో మంత్రి ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. సూర్యనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన ఇంటి ముందు ఆందో ళనకు దిగడంపై మంత్రి అవంతి స్పందించారు. మృతుడి సూర్యనారాయణ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.ప్రమాదం ఎలా జరిగిందో పోలీసులను అడిగితే చెబు తారన్నారు. అయితే సూర్యనారా యణను ఢీ కొట్టిన వాహనంలో తాను లేనని మంత్రి అవంతి స్పష్టం చేశారు.

Related Posts