శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సంకిలి గ్రామం వద్ద బుధవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుంచి పాలకొండ వస్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న లారీని డీ కొట్టింది. దీంతో బస్సులో వున్న పదిమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో యిద్దరి పరిస్థితి విషమంగా వుంది. క్షతగాత్రులను పాలకొండ ఏరియా ఆసుపత్రికు తరలించారు.