YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మాటల నుంచి చేతల దాకా

మాటల నుంచి చేతల దాకా

నల్గోండ
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇన్ని రోజులు బీజేపీ,టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్దాలే నడిచాయి.ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకూ వెళ్ళింది.నల్గొండ,సూర్యాపేట జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పర్యటన సందర్భంగా హింస చెలరేగింది.నిన్న బీజేపీ,టీఆర్ఎస్ నేతలంతా ఒకరిపై ఒకరు కోడి గుడ్లు రాళ్లు విసురుకుంటే,నేడు ఏకంగా కర్రలతోనే దాడులకు సిద్ధమయ్యారు.బండి సంజయ్ చివ్వెంల ఐకేపీ సెంటర్ సందర్శన సమయంలో ఓ ఆటోలో పెద్ద ఎత్తున కర్రలు లభ్యమయ్యాయి.ఆ కర్రలన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.కాగా నిన్న ఇరువర్గాల మధ్య జరిగిన దాడుల్లో బీజేపీ,టీఆర్ఎస్ నేతలతో పాటు పోలీసులు, మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు.

Related Posts