YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఏపి గవర్నర్ ను పరామర్శించిన తెలంగాణ గవర్నర్

ఏపి గవర్నర్ ను పరామర్శించిన తెలంగాణ గవర్నర్

హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హారిచందన్ ను ఏఐజీ  ఆసుపత్రిలో తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ బుధవారం పరామర్శించారు. తరువాత ఆమె మాట్లాడుతూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన ను పరామర్శించేందుకు రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. ఒక టీం ఆఫ్ డాక్టర్లు అన్ని రకాల టెస్టులు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నేను ఒక డాక్టర్ ని కాబట్టి హాస్పిటల్ ఎండి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తో మాట్లాడటం జరిగింది. భగవంతుని దయవల్ల ఆయన త్వరగా కొలుకోవాలి ప్రార్ధిస్తున్నా. గవర్నర్ కి సంబంధించి హెల్త్ బులేటెన్ రాజ్ భవన్ వర్గాలు ఇస్తాయని అన్నారు.

Related Posts