YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా ఎమ్మెల్యేలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు బుద్దా వెంకన్న

వైకాపా ఎమ్మెల్యేలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు బుద్దా వెంకన్న

అమరావతి
అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రవర్తన, వారిభాష వారి తీరుచూశాక, వీళ్లా మనప్రజాప్రతినిధులు అని ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. సంకరజాతికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో చాలామంది ఉన్నారు.  చంద్రబాబునాయుడులాంటి వ్యక్తి కంటనీరుపెట్టుకొని అసెంబ్లీనుంచి బయటకువెళ్తూ చెప్పిన మాటలను, ఆయన శపథాన్నినేనుఅభినందస్తున్నా.  ఆయన నిజంగా బాధపడినాకూడా, గతంలో జయలలిత మాదిరే శపథం చేయడం, వైసీపీపతనానికే నాందికానుంది. నేడు చంద్రబాబుకి జరిగిన అవమానానికి తెలుగుజాతి అంతా బాధపడుతోంది.   తమను ఎవరూఏమీ చేయలేరని ముఖ్యమంత్రి, మొదులు వైసీపీ బ్యాచ్ అంతా కలలుకంటున్నారు. ఈరోజు చంద్రబాబుని అంటున్నవారే, రేపు జగన్ ని దూషిస్తారు.  రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవని జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తేమంచిది. నేడు చంద్రబాబుని అన్నవ్యక్తులు వారిస్వార్థంకోసం భవిష్యత్ లోకచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అనకూడని మాటలంటారు. టీడీపీవాళ్లెవరూ ఏనాడూ జగన్మోహన్ రెడ్డిని, ఆయనకుటుంబసభ్యులను వ్యక్తిగతంగా దూషించలేదు. ఈనాడు చంద్రబాబుని, ఆయనకుటుంబాన్ని దూషించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదు.. ఖబడ్దార్ గుర్తుంచుకోండని అయన హెచ్చరించారు.

Related Posts