YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దేశానికే ఆదర్శంగా తెలంగాణ : మంత్రి కేటీఆర్

దేశానికే ఆదర్శంగా తెలంగాణ : మంత్రి  కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి తో పాలన కొనసాగుతుంది. గతంలో ఎండాకాలం వచ్చింది అంటే వ్యవసాయం ఎండి పోయేవి. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు కరెంట్ ఇవ్వక పోయే వారు. ఇప్పుడు 24 గంటల కరెంట్ అందరికి ఇస్తున్నా రాష్ట్రం భారత దేశం లో మా తెలంగాణ ఒక్కేటేనని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో 25 లక్షల బోర్లు రైతులు వేసుకున్నారు..కరెంట్ ఇవ్వలేదు. ఎరువులు ఇవ్వక రైతులు చనిపోయారు. చెప్పులు లైన్ లో పెట్టి ఎండలో వెళ్లి తిని వచ్చే వారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో  పోలీస్ స్టేషన్ లో విత్తనాలు  ఇచ్చే వారు. అన్నం పెట్టే రైతన్న ల కోసం 17 వేల కోట్లు రుణమాఫీ చేసుకున్నామని అయన గుర్తు చేసారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పిడీ యాక్ట్ పెడుతున్నాం. 67 సంవత్సరాల పాలన లో కట్టని గోదాముల ను, నాలుగు సంవత్సరాల లో నిర్మించాం. 70 సంవత్సరాల లో ఏ సీఎం చేయని పని సీఎం కేసీఆర్ చేశారని అయన అన్నారు. రాజ్ నాధ్ సింగ్ కూడా రైతులకు ఇస్తున్న 8 వేల రూపాయలు ఆశ్చర్యపోయారు. గత ప్రభుత్వాలు రాబంధు ప్రభుత్వాలు  అయితే ఇప్పుడు రైతు బంధు ప్రభుత్వం. నా తెలంగాణ కోటి ఏకరాల తెలంగాణ కావాలి.  సీఎం సంకల్పం నెరవేరుతుందని అయన అన్నారు. దేశం లో ఆదర్శ వంత రైతు రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది.  రైతు సమన్వయ కమిటీ ల తో తెలంగాణ రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. 1956 నాటికి  నల్గొండ లో ఫ్లోరోసిస్ లేదు..గతంలో పాలించిన నాయకుల ద్వారా నే ఆ గతి పట్టింది. ఇంటి ఇంటికి నీళ్లు ఇస్తాం ఇవ్వక పోతే ఓట్లు అడగంఅన్న ఏకైక సీఎం కేసీఆర్ అని మంత్రి అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు నీళ్లు తీసుకువస్తున్నాం.  అందరూ బాగు పడేలా పాలన కొనసాగిస్తున్నాం. వరంగల్ కి 300 కోట్లు బడ్జెట్ లో కేటాయించాము..తెలంగాణ లో అన్ని ప్రాంతాలకు నిధులు ఇస్తున్నామని అన్నారు. సీఎం మీద నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు.  ఎన్నికలు దగ్గర పడుతుండడాం తో సహనం నశించి ఇష్టం వచ్చినవిధంగా మాట్లాడుతున్నారని ఆరో్పించారు. కాంగ్రెస్ నాయకులరా ఎన్నికల సమయం లో కొట్లాడుదాం. గడ్డం పెంచిన ప్రతి ఒక్కరూ గబ్బర్ సింగ్ అవుతారా అని కేటీఆర్ అన్నారు. గల్లీలో ఉన్నా ప్రజలు మా బాస్ లు. కాంగ్రెస్ పార్టీ మొండి చేయి ఇచ్చే పార్టీ అని  ప్రజలందరకి తెలుసని అయన అన్నారు. కాంగ్రెస్ లో అన్ని అడ్డమైన కేసులు ఉన్నా వారు ఉన్నారు. దేశం లో అందరిని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అయన అన్నారు. 

Related Posts