YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాలుష్యరహితంగా హైదరాబాద్ : సీఎం కేసీఆర్

 కాలుష్యరహితంగా హైదరాబాద్ : సీఎం కేసీఆర్

హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఆర్టీసీతో పాటు జిహెచ్ఎంసిలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచుతామని, ప్రైవేటు సంస్థలు కూడా కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా అవగాహన కల్పిస్తామని చెప్పారు.  చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బి.వై.డి. ఆటో ఇండస్ట్రీ కంపెనీల లిమిటెడ్ ప్రతినిధులు ప్రగతి భవన్ లో బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. నూటికి నూరుశాతం బ్యాటరీతో నడిచే వాహనాల తయారీ పరిశ్రమను స్థానిక కంపెనీలతో కలిసి హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు తెలిపారు. చైనా బయట పరిశ్రమ నెలకొల్పడం ఇదే ప్రథమమని కూడా తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. నగరాలు, పట్టణాల్లో వాహనాల వెదజల్లే కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్నదని సిఎం అన్నారు. దీన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వాహనాలు వాడకం తప్పని సరి అని సిఎం చెప్పారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని క్రమం పెంచుతామని, మొదటి దశలోనే 500 వాహనాలు కొనుగోలు చేస్తామని సిఎం ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ఎక్కువ అవకాశం, ఆవశ్యకత ఉందని సిఎం తెలిపారు. రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్టీసీ ఎండి రమణారావు, బి.వై.డి. జనరల్ మేనేజర్ లియూ జూలింగ్,  ఎక్స్ క్యూటివ్ డైరెక్టర్ జాంగ్ జీ  తదితరులు పాల్గొన్నారు. 

బి.వై.డి. రూపొందించిన ఎలక్ట్రిక్ బస్సులో ముఖ్యమంత్రి కొద్ది సేపు ప్రయాణం చేసి పరిశీలించారు. బస్సు నాణ్యతా ప్రమాణాలు బాగున్నాయని అభినందించారు. సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు, కాలుష్య రహిత వాతావరణానికి ఎంతో అనువుగా ఉన్నాయని సిఎం చెప్పారు. ఒక్క సారి చార్జి చేస్తే 300-400 కిలోమీటర్ల వరకు ఎలక్ట్రిక్ వాహనాలు పనిచేస్తాయని, మూడు గంటల్లో ఫుల్ చార్జింగ్ అవుతుందని, బస్సులతో పాటు కార్లు, ఆటోలు, ట్రక్కులు కూడ తాము తయారు చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

Related Posts