YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మసాజ్‌ సెంటర్‌లో రౌడీ మూకల దారుణం ముగ్గురిపై అత్యాచారం, రూ.15 వేల దోపిడీ

 మసాజ్‌ సెంటర్‌లో రౌడీ మూకల దారుణం       ముగ్గురిపై అత్యాచారం, రూ.15 వేల దోపిడీ

సేలం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు సమీప ప్రాంతంలో ఉన్న ఓ మసాజ్‌ సెంటర్‌లోకి రౌడీ ముఠా ప్రవేశించి, అక్కడ పని చేసే ఇద్దరు యువతులతో పాటు మసాజ్‌ సెంటర్‌ యజమానురాలిపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత వారి నుంచి బంగారు నగలు, నగదు దోచుకుని పారిపోయారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. నామక్కల్‌ జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల మహిళ  భర్తతో తెగదెంపులు చేసుకుంది. ఆ తర్వాత సేలం కొత్త బస్టాండు సమీప ప్రాంతంలో ఓ మసాజ్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఇందులో పని చేసేందుకు ఇద్దరు యువతులను కూడా నియమించుకుంది. ఈ సెంటర్‌ ప్రారంభించిన కొద్ది రోజులకే మంచి ఆదరణ లభించింది.దీంతో ఈ సెంటర్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 4వ తేదీన ఈ సెంటర్‌లోకి 10 మందితో కూడిన ఓ రౌడీ ముఠా దౌర్జన్యంగా ప్రవేశించి, లోపల గడియ పెట్టి, అక్కడ పని చేసే సిబ్బందిని బెదిరించింది. ఆ తర్వాత మసాజ్‌ సెంటర్‌ యజమానురాలిని ఓ గదిలో బంధించి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న రూ.15 వేల నగదు, నగలు దోచుకున్నారు. అలాగే, మరి కొంతమంది రౌడీలు అక్కడ పని చేసే మరో ఇద్దరు యువతులపై అత్యాచారం చేశారు.ఈ విషయం బయటకు చెబితే మళ్లీ వచ్చి చంపేస్తామంటూ బెదిరించి, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మసాజ్‌ సెంటర్‌ యజమాని సేలం పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. కమిషనర్‌ ఆదేశం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ దారు ణానికి పాల్పడింది ప్రముఖ రౌడీ ఎలుంబన్‌ కార్తీక్, అత డి అనుచరులని తేలింది. దీంతో కార్తీక్, విజయకుమార్, విఘ్నేష్‌, బాలకృష్ణన్‌లను అరెస్టు చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో గతంలో కూడా పలుమార్లు ఇదే విధంగా మసాజ్‌ సెంటర్లలో దౌర్జన్యం చేసి దోపిడీలకు పాల్పడినట్టు తేలింది. దీంతో వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మిగిలిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related Posts