YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జూన్ నుంచి సాముహిక గృహప్రవేశాలు : సీఎం చంద్రబాబు

జూన్ నుంచి సాముహిక గృహప్రవేశాలు : సీఎం చంద్రబాబు

జిల్లా కలెక్టర్ల సదస్సులో గ్రామీణ గృహనిర్మాణం ప్రగతిపై ప్రత్యేక పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసారు. గత ఏడాది రాష్ట్రంలో సాధించిన ప్రగతిపై గ్రామీణ గృహనిర్మాణ శాఖ ప్రత్యేక పుస్తకం రూపొందించింది. ఈ  కార్యక్రమంలో మంత్రి కాలవ శ్రీనివాసులు, హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డి. కాంతిలాల్ దండే పాల్గోన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి  రాష్ట్రంలో గృహనిర్మాణం పై సమీక్షనిర్వహించారు.  వచ్చే మార్చ్ నాటికి రాష్ట్రంలోని గ్రామాల్లో 10 లక్షల ఇళ్లు నిర్మించాలని అయన అన్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్ళు ప్రారంభించేందుకు జూన్ నెల నుండి ప్రతి నెలా రాష్ట్రంలో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలసి వచ్చే ఏడాదికి 19 లక్షల ఇళ్లు పూర్తి కావాలని అన్నారు. 

Related Posts