YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నాదెండ్ల కు ఘన స్వాగతం

నాదెండ్ల కు ఘన స్వాగతం

నెల్లూరు
జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నెల్లూరు వచ్చారు. చిత్తూరు జిల్లా పర్యటన అనంతరం నాయుడుపేట మీదుగా రోడ్డు మార్గాన జాతీయ రహదారిలోని మెడికవర్ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. కోవూరు వద్ద రాజుపాలెం వెళ్లి అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలుపుతారు. వారితో పాటు సాలుచింతల వరకు పాదయాత్రలో పాల్గొంటారు.భగత్సింగ్ కాలనీ వద్ద వరద ప్రవాహంతో కొట్టుకుపోయిన రోడ్డును, భగత్సింగ్ కాలనీలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం బాధితులతో మాట్లాడతారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు జీఎస్ఆర్ కల్యాణ మండపంలో వరదతో నష్టపోయిన 200 మంది బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Related Posts