కాళేశ్వరం దేవాలయ చైర్మన్ గా నియమితులైన బొమ్మెరి వెంకటేశం ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. దేవస్థానం చైర్మన్ గా తనను నియమించినందుకు వెంకటేశం బుధవారం ప్రగతి భవన్ వచ్చి సిఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను శాలువాతో సన్మానించి, స్వీటు తినిపించారు. కేసీఆర్ తో కలిసి వెంకటేశం ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు.