YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సిక్కోలులో దూసుకొస్తున్న రామ్మోహన్...

సిక్కోలులో దూసుకొస్తున్న రామ్మోహన్...

శ్రీకాకుళం, నవంబర్ 26,
వీడు ఆరడుగుల బుల్లెట్టూ.. ధైర్యం నింపిన రాకెట్టూ' అంటూ అత్తారింటికి దారేది సినిమాలో పవర్స్టార్ పవన్ను వర్ణించిన పాట అభిమానుల్నే కాదు అందరినీ అలరించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అలాంటి ఓ బుల్లెట్టే ఉంది. తెలుగుదేశం పార్టీలో బుల్లెట్లా ముందుకు దూసుకొచ్చింది. ఆ బుల్లెట్ మరెవరో కాదు శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు.2014లో 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రామ్మోహన్నాయుడు వరుసగా శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా రామ్మోహన్నాయుడు హిందీలో అనర్గళంగా మాట్లాడిన తీరుతో సభలో ఉన్న అందరినీ ఆకట్టుకుని ఔరా అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఎండగట్టి యావద్దేశం దృష్టినీ ఆకర్షించారు రామ్మోహన్నాయుడు. దివంగత మాజీ లోక్సభ స్పీకర్, నాన్న కింజరాపు ఎర్రంనాయుడి రాజకీయ వారసత్వాన్ని రామ్మోహన్నాయుడు  అక్షరాలా పుణికిపుచ్చుకున్నారు. ఎర్రంనాయుడి రాజకీయ ఒరవడినే కొనసాగిస్తున్నారు. ఎంపీగా ఎన్నికైన నాలుగేళ్లలోనే నాన్న వారసత్వాన్ని రామ్మోహన్నాయుడు  నిలబెట్టారు.చిన్నతనంలో ఎలాంటి రాజకీయ నీడ పడకుండా పెరిగిన రామ్మోహన్నాయుడు.. ఎంపీగా పోటీ చేసే వయస్సు కూడా రాక ముందే అభ్యర్థిగా ఖరారైన యువ నేత రామ్మోహన్నాయుడు. ఎంపీగా విజయాలు సాధించిన ఆయన భయంతో, బాధ్యతతో, క్రమశిక్షణతో ఎదిగారు. పార్లమెంట్లో రామ్మోహన్నాయుడి గుణాత్మక పనితీరు, వ్యక్తిగత కృషి ఆధారంగా 2020లో సంసద్ రత్న 'జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు’ అందుకున్నారు.  అతి చిన్న వయస్సులోనే సంసద్ రత్న అవార్డు అందుకుని రామ్మోహన్నాయుడు రికార్డులకెక్కారు. తన పనితనంలో, దూసుకుపోయే తత్వంతో పార్లమెంట్‌ పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. బుల్లెట్లా దూసుకుపోయే రామ్మోహన్నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.మినిష్టర్‌ కొడాలి నానిని ఆయన ఇలాఖా గుడివాడలోనే విమర్శించగల దమ్మున్నోడు రామ్మోహన్నాయుడు. రాజకీయ భిక్షపెట్టిన టీడీపీకి కొడాలి వెన్నుపోటు పొడిచారని ఆక్షేపించారు. జగన్ పిరికివాడని, వేల కిలోమీటర్లు నడిచినా బెణకని ఆయన కాలు ఢిల్లీ టూర్ అనగానే ఎందుకు బెణికిందంటూ సూటిగా ప్రశ్నించగల సత్తా ఉన్న నేత రామ్మోహన్నాయుడు. టీడీపీ ఏ కార్యక్రమం తలపెట్టినా ముందువరసలో నిలబడే నిబద్ధతగల యువ నేత రామ్మోహన్నాయుడు. పార్టీ నిర్దేశించిన పలు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అరెస్టులు కూడా అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిన ప్రతిసారి పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ప్రతి నిరసన కార్యక్రమంలోనూ రామ్మోహన్‌ పాత్ర తప్పకుండా ఉండాల్సిందే.విశాఖపట్నంలో రైల్తే జోన్‌ ఎంత అవసరమో స్పష్టంగా వివరిస్తూ 2017లో లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేట్‌ పరం విషయంలో ఏపీ పట్ల సవతితల్లి విధానం ప్రదర్శిస్తోందంటూ లోక్‌సభలోనే తూర్పారపట్టారు రామ్మోహన్‌నాయుడు. జగన్‌ సర్కార్‌ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న నవరత్నాలను బూడిద రత్నాలని ఆయన అభివర్ణించారు. 22 మంది ఎంపీలు ఉన్నా వైసీపీ ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవడాన్ని తప్పుపట్టారు. జగన్‌కు 24 గంటలూ భజనం చేయడంలోనూ, బూతులు తిట్టడంలో వైసీపీ నాయకుడు పోటీపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రైతులంటే జగన్ ప్రభుత్వానికి అస్సలు గౌరవం లేదని, నిర్లక్ష్యం చేస్తోందని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి సక్సెస్‌ అయ్యారు.ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు రామ్మోహన్‌నాయుడు స్పందించే తీరు అందరి చేతా ఔరా అనిపించక మానదు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ మహమ్మారి నియంత్రణలో ఏపీ సీఎం జగన్ విఫలమయ్యారంటూ రామ్మోహన్నాయుడు లేఖ సంధించారు. కోవిడ్ సమయంలో కొన్ని సంస్థల సహకారంతో శ్రీకాకుళం రిమ్స్లో 50 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 50 ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. శ్రీకాకుళంలో కోవిడ్ హెల్ప్లైన్ ఏర్పాటు చేసి, వైద్యులు, హాస్పిటళ్లు, బెడ్ల సమాచారం బాధితులకు అందుబాటులో ఉండేలా చేయడం ఆయన బాధ్యతగల నాయకుడనిపించుకున్నారు.

Related Posts