YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

లాభాలతో ముగిశాయి.

 లాభాలతో ముగిశాయి.

ఇరాన్‌ అణు ఒప్పందానికి అమెరికా కటీఫ్‌ చెప్పడంతో ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి చెప్పుకోదగ్గ లాభాలతో ముగిశాయి. ఉద‌యం కాస్త మంద‌కొడిగా మొద‌లైన ట్రేడింగ్ మ‌ధ్యాహ్నం సెష‌న్ నుంచి జోరందుకుంది. చివ‌ర‌కు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల‌తో స‌రిపెట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 103 పాయింట్లు బ‌ల‌ప‌డి 35,319 వ‌ద్ద ముగియ‌గా మ‌రో సూచీ నిఫ్టీ 23 పాయింట్లు పైకి ఎగ‌బాకి 10,741 వ‌ద్ద స్థిర‌ప‌డింది. 

లాభాల్లో మార్కెట్లు

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో టాటా మోటార్స్(2.79%), ఏసియ‌న్ పెయింట్స్(1.69%), టీసీఎస్(1.39%), యాక్సిస్ బ్యాంక్(1.36%), యెస్ బ్యాంక్(1.31%), టాటా స్టీల్(1.06%) ఎక్కువ‌గా లాభ‌ప‌డ‌గా, మ‌రో వైపు స‌న్ ఫార్మా(1.02%), ఐసీఐసీఐ బ్యాంక్(0.70%), మారుతి(0.70%), విప్రో(0.66%), ఎం అండ్ ఎం(0.64%), బ‌జాజ్ ఆటో(0.61%) న‌ష్ట‌పోయిన వాటిలో ముందున్నాయి. 

నిఫ్టీ సూచీలో టాటా మోటార్స్(2.95%), టైటాన్ కంపెనీ(1.82%), టీసీఎస్(1.4%), యూపీఎల్(1.36%), యెస్ బ్యాంక్(1.33%) లాభ‌ప‌డిన వాటిలో ముందుండ‌గా మ‌రో వైపు అల్ట్రాటెక్ సిమెంట్(2.41%), బీపీసీఎల్(1.82%), లుపిన్(1.64%), స‌న్ ఫార్మా(1.04%), బ‌జాజ్ ఇండ‌స్ట్రీస్(1.03%) అత్య‌ధికంగా న‌ష్టాల‌ను కొనితెచ్చుకున్నాయి.

Related Posts