YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎస్బీఐ నుంచి జీరో బ్యాలెన్స్ అకౌంట్

ఎస్బీఐ నుంచి జీరో బ్యాలెన్స్ అకౌంట్

ముంబయి, మే 9 (న్యూస్ పల్స్)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గ‌తేడాది యోనో యాప్‌ను ప్రారంభించింది.దీని ద్వారా మొ బైల్ నుంచే ఎస్బీఐ పొదుపు ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. అయితే దీనికి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఇన్ని రోజులు మినిమం బ్యాలెన్స్ పేరుతో వినియోగ‌దార్ల ముక్కుపిండి సొమ్ము వసూలు చేసిన ఎస్బీఐ... తర్వాత రూరల్, సెమీ అర్బన్, అర్బన్‌లలో మూడు భాగాలుగా విభజించి ఆ జరిమానా మొత్తాన్ని కొంతమేర తగ్గించి కాస్త ఉపశమనం కలిగించింది. ఇక తాజాగా మరో మంచి వార్త చెప్పింది ఎస్బీఐ... జీరో బ్యాలెన్స్‌తో కొత్తగా ఇన్ట్సా సేవింగ్ ఖాతాను ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ ఈ ఏడాది ఆగస్టు వరకే అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. 

ఎస్బీఐ సున్నా నిల్వ‌ ఖాతా

ఇక ఇన్ట్సా ఎస్బీఐలో ఖాతా ఓపెన్ చేయాలంటూ ఏ బ్రాంచీని సందర్శించాల్సిన అవసరం లేదు... ఇంటి నుంచి ఆన్‌లైన్‌లో సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేసి ఎస్బీఐలో ఖాతా తెరుచుకునే వేసులుబాటును కూడా కల్పించింది. ఈ జీరో బ్యాలెన్స్ ఖాతా ఆఫర్ కేవలం పరిమిత కాలం ఆఫర్ మాత్రమేనని ఎస్బీఐ ప్రకటించింది. ఈ పేపర్లను సంబంధిత బ్రాంచ్‌లో సమర్పించాల్సిన అవసరం లేకుండా పేపర్‌లెస్ ఎకౌంట్‌ ఓపెన్ చేసే అవకాశాన్ని ఎస్బీఐ అందిస్తోంది. ఈ ఎకౌంట్ ఓపెన్ చేసిన వినియోగదారులు రూపీ డెబిట్ కార్డును అందిస్తోంది. ఈ ఖాతాలో వినియోగదారుడు లక్ష రూపాయాల వరకు పొదుపు చేసుకునే అవకాశం ఉండగా... వార్షిక లావాదేవీల పరిమితి రూ.2 లక్షలుగా ఉంటుంది. ఇక ఈ ఖాతాను ఒక ఏడాది తర్వాత సాధారణ సేవింగ్ ఖాతాగా మార్చుకునే వీలుండగా... ఆ సమయంలో వినియోగదారుడు సంబంధిత బ్రాంచ్‌ని సందర్శించాల్సి ఉంటుంది. 

Related Posts