YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

స్మశాన వాటిక స్థలాన్ని తెరాస కార్పొరేటర్ కబ్జా గ్రామస్థుల ఆరోపణ

స్మశాన వాటిక స్థలాన్ని తెరాస  కార్పొరేటర్ కబ్జా  గ్రామస్థుల ఆరోపణ

రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా  బడంపేట్ కార్పొరేషన్ మామిడి పల్లి గ్రామంలో సర్వే  నెంబర్ 141 లో ఉన్న స్మశాన వాటికు సంబంధించిన భూమిని స్థానిక టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ శివ కుమార్,మహేశ్వరం బీసీ సెల్ అధ్యక్షుడు నిమ్మల నరేందర్ గౌడ్ కబ్జా చేస్తున్నారని  గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని 60 గజాల లాగా 15 లక్షలకు అమ్ముకుంటున్నారని స్థానికులు అన్నారు. అడ్డుకున్న గ్రామస్తులు పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. ప్రజల సమస్యల పై ప్రశ్నించడానికి వెళ్లిన తనపై కూడా పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని అన్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు అన్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.

Related Posts