YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

5న ఇబ్రహీంపట్నంలో మెగా జాబ్ మేళా

5న ఇబ్రహీంపట్నంలో మెగా జాబ్ మేళా

రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన ఇబ్రహీంపట్నంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఎపిఎస్‌ఎస్‌డిసి) కృష్ణా జిల్లా మేనేజర్ ప్రణయ్ ఓ ప్రకటనలో తెలిపారు. నిమ్రా ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే జాబ్ మేళాకు 25 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. 10వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, ఎంటెక్, బిఫార్మసి, ఎంఫార్మసీ,డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన18 నుంచి 30 ఏళ్లలోపున్న యువతీ యువకులు తగిన ధృవీకరణ పత్రాలతో హాజరుకావచ్చని ఆయన తెలిపారు.జాబ్ మేళాకు హాజరు కావాలనుకునే యువతీ యువకులు తమ వివరాలను http://jobskills.apssdc.in/sdc లో నమోదు చేసుకోవాలి. అనంతరం అభ్యర్థులు తమ మెయిల్ కు వచ్చిన హాల్ టికెట్ ను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కొరకు టోల్ ఫ్రీ నంబర్ 18004252422 మరియు 9700092606 నంబర్లలో సంప్రదించవచ్చు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కృష్ణా జిల్లా మేనేజర్ ప్రణయ్ కోరారు.

Related Posts