YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సజ్జలను అడ్డుకున్న వదర బాధితులు

సజ్జలను అడ్డుకున్న వదర బాధితులు

కడప
రాజంపేటలో సజ్జల రామకృష్ణారెడ్డికి నిరసన సెగ తగిలింది.  వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన సజ్జలను వరద బాధితులు అడ్డుకున్నారు.  వరదల్లో సర్వం కోల్పోయి అనాథలుగా మారిన మాకు రూ.95 వేలు ఇచ్చి సరిపెడతారా అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇళ్లు, పొలాలు, పశువులు, నగదు, ధాన్యం అన్నీ వరదల్లో కొట్టుకుపోతే ప్రభుత్వం ఇచ్చే సాయం ముష్టిలా ఉందని బాధితుల మండిడ్డారు. అధికారులను, పోలీసులను నిలదీసారు. అన్నమయ్య డ్యామ్ తెగేవరకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Related Posts