YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చర్చకు సిద్దం మంత్రి జగదీష్ రెడ్డి

చర్చకు సిద్దం మంత్రి జగదీష్ రెడ్డి

హైదరాబాద్
రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర బిజెపి ప్రభుత్వం అదే మోసాగించే ప్రయత్నం తప్ప రాష్ట్రానికి మేలు ఎం చేసింది లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం అయన శంషాబాద్ ఎయిర్ పోర్టు లో మీడియాతో మాట్లాడారు. వాళ్ళ ప్రెస్ మీట్ లో చెప్పిందే చెప్పారు తప్ప కొత్తగా ఎం లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాషా గురించి చెప్తే దయ్యాలు వేదాలు వల్లినట్లు ఉంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడలేదు,రాష్ట్రం నుండి ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బాధ్యతాయుతంగా మాట్లాడలేదు. దేశంలో ఎక్కడ లేని పథకాలు సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రవేశపెట్టారు. మాటలు కాదు చేతలు కావాలి. బాషా గురించి ఇతనే మాట్లాడాలి ఇతను మాట్లాడిన మాటలు ఎవరికి తెల్వదు. ఎన్ని కొంటారో ఇప్పటివరకు చెప్పడం లేదు,కిషన్ రెడ్డి  ఎన్ని కొంటారో చెప్పకుండా ఏవేవో మాట్లాడుతున్నాడని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గా ఎంపీలు కాదు వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ మంత్రులు మాట్లాడాలి. ఎందుకు ఇక్కడే వరి ధాన్యం పెరిగింది ఎందుకు మీ గుజరాత్ లో పెరుగలేదు. అన్ని రాష్ట్రాల్లో లేని ఇక్కడ ఎందుకు ఇబ్బంది అని మాట్లాడుతున్నారు.అన్ని రాష్ట్రాల్లో కంటే ఇక్కడే అధికంగా ధాన్యం పండుతుంది అనేదానికి ఇది నిదర్శనం కాదా. 2014 తరువాత తెలంగాణా ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో చూస్తే తెలుస్తోంది. తెలంగాణ వచ్చాక నీళ్లు వచ్చాయి ,పంటలు పండుతున్నాయి కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలు పండించిన పంటలు కొనడం లేదు ఎందుకు చెప్పాలి. బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఇవాళ మీ కేంద్ర మంత్రి పార్లమెంట్ లో మాట్లాడుతాడా... మేము ఎన్ని రోజులైనా మాట్లాడడానికి చర్చకు సిద్దంగా ఉన్నాం. దమ్ముంటే పార్లమెంట్ లో చర్చ పెట్టండి మా సభ్యులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ధాన్యం ఎందుకు కొనరో చెప్పడం లేదు.2014ముందు కేసీఆర్ లేడు తెలంగాణ రాష్ట్రం లేదు 2014 తరువాత కేసీఆర్ వచ్చాడు తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ  ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకో మీ దగ్గర రైతు బంధు లేదు,ఎక్కడ మీరు పాలించే రాష్ట్రంలో ఎందుకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రం లో ఇచినట్టే అన్ని రాష్ట్రాల్లో మీరు ఎందుకు అమలు చేయడం లేదు. మీకు ఆహార భద్రత పై అవగాహన లేదు.మీ చేతుల్లో ఉండేవి మీరు చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చిల్లర మాటలు మాట్లాడేది మీరు. మా ముఖ్యమంత్రి లో తెలంగాణ ప్రజల ఆవేశం కనిపించింది. మా తెలంగాణ ప్రజల వడ్లు ఎన్ని కొంటారో చెప్పడం లేదు. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే బాధ్యత మిది.అదికాకుండా అడ్డదిడ్డంగా ఏదేదో మాట్లాడుతున్నారు. సంవత్సరం ప్రణాళిక ఇవ్వమని మన సీఎం కేసీఆర్ అడిగారు అందులో తప్పు ఏముందు చెప్పండి. అన్ని ప్రభుత్వాలకు పంచవర్ష ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు ఉంటాయి.మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రణాళికలు లేవని అన్నారు.

Related Posts