YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వామ్మో...కోడి ధరలు

వామ్మో...కోడి ధరలు

కోడి కూర అంటే తెలుగు రాష్ట్రాల్లో నాలుక కోసుకోని వారుండరు. కానీ, గత కొన్ని రోజులుగా కోడి మాంసం తినాలంటే జనం ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ధరలు కొండెక్కి కూర్చోవడమే దీనికి కారణం. 15 రోజులుగా చికెన్ ధరలు భారీగా పెరిగాయి. రెండు వారాల కింద కిలో స్కిన్‌లెస్ కోడి మాంసం ధర రూ.180గా ఉండగా.. ప్రస్తుతం ఇది రూ.220-240 వరకు చేరుకుంది. దీనికి ప్రధాన కారణం మండుతున్న ఎండలే.తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులు, అకాల వర్షాలకు కోళ్లు పెద్ద మొత్తంలో మృత్యువాత పడుతున్నాయి. వాటిని తట్టుకొని బతికిన కోళ్లు కూడా బాగా బరువు తగ్గుతున్నాయి. దీంతో పౌల్ట్రీ ఫాం యజమానులు వేసవిలో కోళ్ల పెంపకం చేపట్టడానికి సుముఖుత చూపడం లేదు. కొత్త బ్యాచ్ కోడి పిల్లలను వేయడం లేదు.ఇదే సమయంలో పెళ్లిల్లు, శుభకార్యాల సీజన్ కావడంతో కోడి మాంసానికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. దీంతో చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇక నాటుకోడి ధర అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డిమాండ్ తగినట్లుగా సరఫరా లేకపోవడం వల్ల ఈ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.చికెన్ ధరల్లో అనూహ్యమైన పెరుగుదల విక్రయాలపై భారీగా ప్రభావం చూపుతోంది. ఆదివారం వస్తే కిటకిటలాడే చికెన్ షాపులు కూడా బోసిపోయి దర్శనమిస్తున్నాయి. ధరల పెరుగుదల కారణంగా కస్టమర్లతో పాటు తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామని దుకాణదారులు వాపోతున్నారు. మే 17 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో చికెన్ ధరలు మరింతగా పెరుగుతాయేమోనని సాధారణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related Posts