YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అంబెద్కర్ కు నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అంబెద్కర్ కు నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున శ్రద్ధాంజలి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది ఎస్సి ఎస్టీ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా  స్కాలర్ షిప్ లు మంజూరు చేసాం. 74 సంవత్సరాల తరువాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్ లో అమలులోకి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అజాది కా అమృత్ మహోత్సవ లో భాగంగా అంబెడ్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు.

Related Posts