YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

చెవి కమ్మల కోసం వృద్ధురాలి గొంతుకోసిన దొంగలు

చెవి కమ్మల కోసం వృద్ధురాలి గొంతుకోసిన దొంగలు

మంగళగిరి
ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి గొంతుకోసి బంగారు చెవి పోగులను గుర్తు తెలియని దుండగులు దోచుకెల్లారు. ఈ  ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని పెద వడ్లపూడిలో శనివారం అర్ధరాత్రి  జరిగింది. మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పెదవడ్లపూడి గ్రామానికి చెందిన వృద్ధురాలు లక్ష్మీ మనోహరమ్మ ఒంటరిగా వుంటోంది.  ఈ విషయం తెలిసిన గుర్తుతెలియని ముగ్గురు దుండగులు రాత్రి నిద్రిస్తున్న వృద్ధురాలిపై  దాడి చేసారు. భయపడిపోయిన బాధితురాలు కేకలు వేసింది.  దాంతో దుండగులు రెచ్చిపోయి ఆమె ఆమె గొంతు కోసారు. చెవికి ఉన్న బంగారం పోగులను బలవంతంగా లాక్కొని పారిపోయారు. రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్నవృద్దురాలిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Related Posts