YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సాయుధ దళాల పతాక దినోత్సవం

సాయుధ దళాల పతాక దినోత్సవం

సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ ని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశం కోసం అమరులైన జవాన్లను ఈ ఫ్లాగ్ డే నాడు స్మరించుకుంటు వారి కుటుంబాల సంక్షేమం కోసం సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు అందిద్దాం . త్యాగానికి.ప్రతిరూపం సైనికులు వారిని ఆదుకోవడం మన బాధ్యత.  మనదేశ.భవిష్యత్తు కోసం రక్షణ కోసం పాటుపడుతున్న జవానుల సంక్షేమం చాలా చాలా ముఖ్యం .  దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన సైనిక కుటుంబాలు, మాజీ సైనిక కుటుంబాల  సంక్షేమం కోసం  విరాళాలు ఇచ్చి ప్రతి ఒక్కరం దేశభక్తి చాటాడమే కాదు అమరులకు నివాళులు అర్పించినట్లు అవుతుందని అన్నారు.

Related Posts