YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి

దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి

అమరావతి
రాజ్యాంగం గురించి మంత్రి బొత్స మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. తూర్పుగోదావరి జిల్లాలో నాటు సారా పంపిణీ చేసిన బొత్స రాజ్యాగం గురించి మాట్లాడ్డం హాస్యాస్పదం. అమరావతిలో 25 ఎకరాల్లో 100 కోట్లతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గండికొట్టారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అరోపించారు. అంబేద్కర్ నమూనా విగ్రహాలను చోరీ చేసిన వారిని కూడా ఇంతవరకూ పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వమిది. మీరా రాజ్యాంగస్పూర్తి గురించి మాట్లాడేది. అంబేద్కర్ ఆశయాలకు జగన్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారు. వోక్స్ వ్యాగన్ విషయాలు మాట్లాడే దమ్ము బొత్సకు ఉందా ? సొమ్ములు పోనాయి నేనేటి సేత్తానంటూ చేతలు దులుపుకుంటే సరిపోతుందా? వోక్స్ వ్యాగన్ కంపెనీ పెట్టేందుకు జర్మనీ నుంచి వ్యక్తి ఏమయ్యారో బొత్స చెప్పాలి. చంద్రబాబు గారిని విమర్శించే స్థాయి బొత్సకు ఎక్కడిది? రూ. 5 వేల కోట్ల ఇళ్ల స్కామ్ సూత్రధారి ఎవరో బొత్స చెప్పాలి. వైఎస్ హయాంలో 14 లక్షల ఇళ్లు కట్టామంటున్న బొత్స అవి ఎక్కడున్నాయో చూపించాలి. చంద్రబాబు గారు పేదల కోసం కట్టించిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు చేసే అధికారం మీకెక్కడిది? రెండున్నరేళ్లలో ఏపీని భ్రష్టు పట్టించారు. టిడ్కో ఇళ్లు, పోలవరం, అమరావతిని పాడుబెట్టిన వైసీపీ నేతలను పాడుబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ చేతకాని పాలనతో ఢిల్లీలో ఏపీ పరువును తీసేస్తున్నారు. ఎంపీ రఘురామపై వైసీపీ ఎంపీలు నోటికొచ్చినట్టు మాట్లాడటం హేయం. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో విజయను వైసీపీ నేత తాతాజీ బెదిరించడం దారుణం. గతంలోనూ ఎంపీడీవో సరళ, డాక్టర్  అనితారాణిని వేధించిన ఘటనలు చూశామని అన్నారు. మహిళా ఉద్యోగులను వైసీపీ నేతలు వేధిస్తుంటే తుగ్లక్ సీఎం ఏం చేస్తున్నారు? రెండున్నరేళ్లలో తెలంగాణకు రూ. 17,000 కోట్ల పెట్టుబడులు వస్తే ఏపీకి వచ్చింది కేవలం రూ. 2,700 కోట్లు. ఈ మాట పార్లమెంటులో కేంద్రమంత్రే స్వయంగా చెప్పారు. ఆ పెట్టుబడులు కూడా చంద్రబాబు  కృషితో వచ్చినవే. యువతను చెడు వ్యసనాలకు అలవాటు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం కాదా? 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క కేసూ లేని వ్యక్తి చంద్రన్న. జీవితమంతా ప్రజల కోసమే ఆలోచించే చంద్రబాబు గారికి విమర్శించే స్థాయి మీకెక్కడిది? అమ్మఒడి డబ్బులు నాన్న బుడ్డితో లాగేస్తున్నారు. ఓటీఎస్ మాటున డ్వాక్రా సొమ్మును కాజేస్తున్నారు. ఏపీ రాజధాని ఎక్కడో చెప్పుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు. అమరావతి మహిళలను వేధిస్తున్న మిమ్మల్ని జనం తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆమె అన్నారు.

Related Posts