YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పొందూరులో డిగ్రీ కళాశాలని ప్రారంభించిన స్పీకర్ తమ్మినేని

పొందూరులో డిగ్రీ కళాశాలని  ప్రారంభించిన స్పీకర్ తమ్మినేని

శ్రీకాకుళం
 శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల చిరకాలవాంఛ  డిగ్రీ కళాశాల ను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. 40 సంవత్సరాలు గా డిగ్రీ కళాశాల లేక పొందూరు,తదితర మండలాలు ఇబ్బందులు పడుతున్నారు.  డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవంలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ పిల్లలు భవిష్యత్ తరాలకు రధ సారథులు. రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను ఎక్కాలి. ప్రపంచం పరుగులు పెడుతున్న నేటి తరుణంలో విద్యార్థులు అందరూ ఉన్నత చదువులు చదవాలి. 40 సంవత్సరాల చిరకాల వాంఛ నేటితో పొందూరు మండలానికి తీరనుంది. పొందూరు మండలం లో బిసి గురుకుల పాఠశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తమ్మినేని అన్నారు. ప్రభుత్వం పరంగా రైతులను ఆదుకుంటుందని లిఫ్ట్ ఇరిగేషన్ పనులతో రైతులకు రానున్న రోజుల్లో మంచి రోజులు రానున్నాయని.  రాష్ట్రంలో 12 ఉన్నత  కళాశాలలో శ్రీకాకుళం జిల్లాకి  ఉన్నత కళాశాలలు వచ్చాయన్నారు.

Related Posts