YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పీఆర్సీ హామీ ఇవ్వడం సంతోషం

పీఆర్సీ హామీ ఇవ్వడం సంతోషం

విశాఖ
13 లక్షల ఉద్యోగులు, పెన్షనర్ల  71 డిమాండ్ లకు సంబంధించి దఫ దఫాలుగా చీఫ్ సెక్రటరీ ని కలవడం జరిగింది. తిరుపతి లో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పీ ఆర్ సీ పై హామీ ఇవ్వడం సంతోషమని ఏపీ ఎన్ జీ వో  రాష్ట్ర   అద్యక్షుడు  బండి శ్రీనివాస్ అన్నారు. మేము 71డిమాండ్ లు ఇస్తే వీటిపై క్లారటీ లేదు. ముఖ్యమంత్రి ప్రకటన కంటే ముందే మా కార్యాచరణ ప్రకటించాం. రేపటి నుంచి శ్రీకాకుళం నుంచి ఉద్యమం. విశాఖ జిల్లా నుండి ఉద్యమం ప్రారంభం చేయడం అదృష్టం గా భావిస్తున్నాను. సజ్జల రామకృష్ణ రెడ్డి అక్టోబర్ నెలాఖరు నుంచి పీ ఆర్ సీ అమలు అని చెప్పి, ఇవ్వలేదు. జీతాలు సక్రమంగా రావడం లేదు. పెన్షనర్ల కు కూడా రెండు నెలలు గా మాత్రమే పడుతున్నాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్  సమావేశం లో  పీ ఆర్ సీ నివేదిక ఇవ్వలేదు. ఎందుకు నివేదిక దాస్తున్నారు. అర్థం కావడం లేదు. యాబై శాతం ఫిట్ మెంట్ డిమాండ్ చేశాం. అనేక డిమాండ్ లకు సంబంధించి అశోక్ మిశ్రా ఎంత శాతం ఇచ్చారో తెలపాలి. ప్రధాన నగరాలలో ఉద్యోగులు కు 30శాతం హెచ్ ఆర్ ఏ ఇవ్వాలని డిమాండ్ చేశాం. కానీ ఇప్పటికి నివేదిక ఇవ్వలేదు. జీపీఎఫ్, ఏపీ జి యల్ ఏ బిల్లుల పెండింగులో వున్నాయి 1600కోట్లు రూపాయలు వరకూ. కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేశాం. ప్రభుత్వానికి మా పై కనికరం లేదనేది కనిపిస్తుంది. 10వ తరగతి చదివిన ఏ ఎన్ ఎం కి ట్యాబ్ ఇచ్చి, ఫీల్డ్ వర్క్, హాజరు పట్టి లో బయో మెట్రిక్ తదితర ఇబ్బందులు వున్నాయి. 143 జీవో ప్రకారం వైద్య శాఖ ఉద్యోగులు ని సరెండర్ చేస్తూ న్నారు. వీరిని ఏం చేస్తారో తెలియదు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అధికారులు పని చేసేలా చేయాలని 4వ తరగతి ఉద్యోగులు వయోపరిమితి  62 కి పెంచాలి. కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్. సీపీయస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ను అక్టోబర్ లో రెగ్యులర్ చేస్తామని చేయలేదు. కారణం తెలపాలి. అయిదు వేల మంది వరకు కోవిడ్ సమయంలో చని పోయారు. 1వ తారీఖు జీతాలు ఇవ్వడం లేదు. సి ఎఫ్ ఎమ్ ఎస్ వలన తీవ్ర ఇబ్బందులు. గత ప్రభుత్వ విదానాలను రద్దు చేయాలి.  ఔట్ సోర్సింగ్ వారికి ఉద్యోగం భద్రతా లేదు. జీతం పెరగడం లేదు.  ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లు కు అందరు ఉద్యోగులు సపోర్ట్ చేస్తున్నారని వెల్లడించారు.  పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీ లు నెరవేర్చాలి. కొన్ని చానల్స్ లో వక్రీకరించి,ప్రభుత్వం ని గద్దె దించుతామని చెప్పిన మాటలు అంతర్ఘత సమావేశంలో మాట్లాడిన మాటలను ట్రోల్ చేయడం దారుణం. ముఖ్యమంత్రి పీ ఆర్ సీ పై తిరుపతి లో మాట ఇచ్చారు అంటే మా పై సానుకూలంగా వున్నారనే బావిస్తున్నానని అన్నారు.
అమరావతి జేఏసీ అద్యక్షుడు ఫణి పేర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ రూపోందించాం. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమం తీవ్ర తరంఅయింది.  ఉద్యమాన్ని ఏ పరిస్థితి లలో చేస్తున్నాం అనేది ప్రభుత్వం తెలుసుకుంది. ఉద్యమం తరువాత మాత్రమే గవర్నమెంట్ లో మాట్లాడుతున్నారు . మూడు మీటింగ్ లు పెట్టారు తప్ప చర్చలు జరగడం లేదు.  ప్రభుత్వం స్పందించకపోతే, రెండవ స్థాయి ఉద్యమాలు తప్పవు. గవర్నమెంట్ కి ఫేవరనో, ప్రతి పక్షాలు కి ఫేవరనో బావించవద్దు. గొంతెమ్మ కోర్కె లు కాదు. ఇక్కడ జేఏసీ చైర్మన్ గా చేసిన గోపాల్ రెడ్డి స్టేట్ మెంట్ హాస్యాస్పదం. మీటింగ్ లో అధికారులు చెప్పారు ఒకటో తేదీన ఇస్తామని హామీ ఇచ్చారు అంటే సరి గా రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా వున్నప్పుడు పంచి ఊడగొడతాం  అని గోపాల్ రెడ్డి అనలేదా. దాచుకున్న డబ్బులు అడిగితే ఇవ్వలేక పోతున్నారు. పీ ఆర్ సీ పై ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. కానీ 71 డిమాండ్ లలో ఇది ఒక డిమాండ్ మాత్రమే.  22సంవత్సరాల గా కాంట్రాక్ట్ ఉద్యోగులు పని చేస్తున్నారు. తక్షణమే పర్మినెంట్ చేయండి.  కార్యచరణ ప్రకారం ఉద్యోగులు అంతా ఉద్యమం లో పాల్గొనాలి. సెక్రటేరియట్ ఎంప్లాయిస్, రెవెన్యూ, ఏపీ జేఏసీ, గతంలో ఇవన్నీ ఒకే జేఏసీ గా వుండేవారు. అప్పటి నేత పై బేదాభిప్రాయాలున్నాయి. 106 సంఘాలు, అమరావతి జేఏసీ లో 90 వున్నారు.  పేపర్ స్టేట్ మెంట్ లు ఇచ్చే కొన్ని సంఘాలు వున్నాయని అన్నారు.

Related Posts