YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మహిళ హత్య

మహిళ హత్య

నెల్లూరు
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం లింగవరంలో మహిళ  హత్యకు గురయింది. తోడు వుంటా అన్నోడే కాటికి పంపాడు. మృతురాలు  నెల్లూరు మాధవి అలియాస్ నందిని(25). నిందితుడు నెల్లూరు రూరల్ మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన  చల్లా గోవర్ధన్.  మృతురాలి ఇదివరకే పెళ్ళై ఇద్దరు మగ పిల్లలు వున్నారు. అయితే,  గత కొద్దిరోజులుగా లింగవరంలో అద్దె ఇంట్లో వాళ్లీద్దరూ కలిసి జీవిస్తున్నారు. మంగళవారం  రాత్రి మాధవిని హత్య చేసినట్టు గోవర్ధన్ 100కి డయల్  చేసి చెప్పినట్టు సమాచారం. మృతురాలి బంధువులకు సమాచారం అందించారు. చిల్లకూరు పోలీసులు,గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts