సాగు కు ఎకరానికి 8 వేలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కెసీఅర్ ప్రభుత్వం. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. గురువారం నాడు ఉప్పల్ లో జరిగిన రైతు బంధు కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేయర్ మాట్లాడుతూ భూమి కబ్జాలో ఉన్న వారికి పూర్తిస్థాయిలో భూమి హక్కులు కల్పిస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వం మన కెసీఆర్ ప్రభుత్వం. రైతుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగు నింపుతున్నారని అన్నారు. ఇన్నాళ్లు పాలించిన వారు భూములు గుంజుకున్నారే.., తప్ప, పేదల గురించి ఆలోచించిన పాపాన పోలేదని అన్నారు. జిల్లాలో వందలాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. భూములకు హక్కు కల్పించి హక్కుదారులు చేసిన దేశంలోనే ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. పేర్లను రికార్డులకు ఎక్కించి ఈ రోజు నుంచి సర్వ హక్కులు కల్పిస్తున్నామని వెల్లడించారు. కడుపు నిండా తినాలి.. కంటి నిండా నిద్రపోవాలనే భరోసా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రభుత్వం. గత ప్రభుత్వాలు భూములు గుంజుకుంటే మన ప్రభుత్వం భూమికి హక్కు కల్పించి పట్టాలు ఇస్తుందని అయన అన్నారు.