YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చేప మందు పంపిణికి ఏర్పాట్లు

 చేప మందు పంపిణికి ఏర్పాట్లు

 రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను గురువారం నాడు సచివాలయంలో బత్తిన హరినాధ్ గౌడ్ కుటుంబ సభ్యులు కలిసారు. జూన్ 8 వ తేదీన మృగశిరకార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో  చేప మందు పంపిణీ కి ప్రభుత్వ సహాయం అందించాలని కోరారు.ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.తరువాత మంత్రి మాట్లాడుతూ చేప మందు కార్యక్రమానికి  ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేపడతామని అన్నారు. చేప మందు ప్రసాదం కోసం మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తారు. చేప మందు కోసం వచ్చే వారి కోసం అన్ని శాఖల ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని అన్నారు. గత సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేప మందు పంపిణీ చేయడం జరిగింది. వారం రోజుల్లో జీహెచ్ ఎంసీ, రెవెన్యూ, పోలీస్, వాటర్ వర్క్స్, హెల్త్,  ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 2.5, నుండి 3 అంగుళాల చేప పిల్లలు సుమారు 1.20 లక్షలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.

Related Posts