YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఓటుహక్కు వినియోగించుకున్న మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

ఓటుహక్కు వినియోగించుకున్న మంత్రి  హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

సిద్దిపేట
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఓటు వేసే అవకాశం రాలేదని  మంత్రి తెలిపారు. ఈసారి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి వచ్చి సిద్దిపేట డిగ్రీ కాలేజ్ లో ఓటు హక్కు వినియోగించుకొని మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో అందరూ ప్రజాప్రతినిధులు న్నందున 99% ఓటు నమోదు కానుందని మంత్రి హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Related Posts