YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కేంద్రం మెడలు వంచుతానని కేంద్రం ముందు మెడలు వంచాడు

కేంద్రం మెడలు వంచుతానని కేంద్రం ముందు మెడలు వంచాడు

కడప డిసెంబర్ 10
కడప తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న గౌరవ సభలలో  బాగంగా కడప నియోజకవర్గంలోని 45,46వ డిజన్లనందు 45 వ డివిజన్ ఇంచార్జ్ మాజీ కార్పొరేటర్ వికాస్ హరి  ఆధ్వర్యంలో గౌరవ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా వచ్చిన కడప నియోజకవర్గ ఇంచార్జ్ అమీర్ బాబు, కడప నగర అధ్యక్షులు సానపురెడ్డి శివకొండారెడ్డి,  కడప నగర మహిళా అధ్యక్షురాలు మురికినాటి సునీత  మాట్లాడుతూ పాదయాత్ర లో బాగంగా నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అని ప్రగల్భాలు పలికి పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ ఎక్కడా ప్రత్యేక హోదా మీద ఒక్కమాట కూడా మాట్లాడకుండా మెడలు వంచాడు ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరం అంచనాలు తగ్గించినా క్రిష్ణా జలాల వాటాలు తగ్గించినా వివిధ నీటి ప్రాజెక్టులు విషయంలో కేంద్రం కొర్రీలు పెడుతున్నా, రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం చేసినా  రాష్ట్రానికి రైల్వేజోన్ ఇవ్వకపోయినా కనీసం గొంతెత్తి మాట్లాడటం కాదు కన్నెత్తి కేంద్రం వైపు చూడాలన్నా ఈ వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి వణుకు పుడుతోంది. ఆరోజు చంద్రబాబు నాయుడు  ప్రత్యేక ప్యాకేజీ కి ఒప్పుకుని దానికి చట్టబద్ధత కల్పించాలని అడిగితే. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇతని పేటియం బ్యాచ్ ప్రత్యేక హోదా కావాలన్నారు నేను ప్రత్యేక హోదా తెచ్చి చూపి‌స్తానని ఈ జగన్మోహన్ రెడ్డి ఉత్తరకూమారుడిలా ప్రగల్భాలు పలికాడు. అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తి కావస్తున్నా ప్రత్యేక హోదా పై ఏరోజు ప్రశ్నించిన దాఖలాలు లేవు.
ఈ జగన్మోహన్ రెడ్డికి ఇకనైనా దమ్ముంటే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించి రాయలసీమ బిడ్డను అని నిరూపించుకోమనండని అన్నారు‌.
ఈ కార్యక్రమంలో కడప నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్, కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, తెలుగుదేశం నాయకులు అనీల్ కుమార్, నాయుడు, మురళీధర్ రెడ్డి, వరప్రసాద్, డివిజన్ ఇంచార్జ్లు సానపురెడ్డి రవిశంకర్ రెడ్డి,   కోండా సుబ్బయ్య, మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts