YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పార్లమెంట్ పై దాడికి ఇరవై ఏళ్లు

పార్లమెంట్ పై దాడికి ఇరవై ఏళ్లు

న్యూఢిల్లీ
భారత పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగి సరిగ్గా ఇరవై ఏళ్లయింది.  2001 డిసెంబరు 13న పార్లమెంటుపై జరిగిన ఉగ్ర దాడిలో ప్రాణాలర్పించిన భద్రతా సిబ్బందికి రాష్ట్రపతి కోవింద్ తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే భారత పార్లమెంట్పై ఉగ్రదాడిని నిలువరించి, తమ ప్రాణాలను అర్పించిన వీరుల  అత్యున్నత త్యాగానికి దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని రాష్ట్రపతి అన్నారు.   ‘2001లో సరిగ్గా ఇదేరోజున ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడికి ఎదురొడ్డి నిలిచి తమ ప్రాణాలను అర్పించిన భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తున్నాను. వారి అత్యున్నత త్యాగానికి దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది’ అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

Related Posts