YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఎప్పుడూ ధర్మమే గెలుస్తుంది

ఎప్పుడూ ధర్మమే గెలుస్తుంది

రాయలసీమలో ఒకప్పుడు రాళ్లు మాత్రమే ఉండేవని... నాలుగేళ్ల వ్యవధిలో తాను ఎన్నో పరిశ్రమలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు సమీపంలోజైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం పారిశ్రామికవేత్తలు, మీడియాతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.  కర్నూలు జిల్లాను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. మరిన్ని సంస్థలు కర్నూలు జిల్లాకు రాబోతున్నాయని తెలిపారు. కొత్త పరిశ్రమల వల్ల 80 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు. కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీకి వైసీపీ వత్తాసు పలుకుతోందని విమర్శించారు. వైయస్ సీఎంగా ఉన్న సమయంలో రాయలసీమకు కేవలం ఒకే ఒక పరిశ్రమ వచ్చిందని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఓటేయమని తాను చెప్పలేదని, మనకు అన్యాయం చేసిన వాళ్లకు మాత్రం ఓటు వేయద్దని మాత్రం చెప్పానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలో ఈరోజు పర్యటించిన చంద్రబాబు మాట్లాడుతూ, అవినీతి కేసులు ఉన్న పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న తనపై వైసీపీ తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తూ, విమర్శిస్తోందని మండిపడ్డారు. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన వైసీపీ నేతలు బీజేపీతో లాలూచీ పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. కాగా, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పరిశ్రమల స్థాపనతో కర్నూలు జిల్లా దశ తిరగనుందని, ఓర్వకల్లుకు పరిశ్రమలు తరలివస్తున్నాయని చెప్పారు. ఉద్యోగాల నిమిత్తం విద్యావంతులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, రూ.85 వేల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, సెప్టెంబర్లో ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు ప్రారంభం కానుందని చంద్రబాబు చెప్పారు.

Related Posts