YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రఘురామ గుస్సా

రఘురామ గుస్సా

హైదరాబాద్, డిసెంబర్ 14,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్ రెడ్డి పాలనపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని అన్నారు. 377 నిబంధన కింద లోకసభలో లిఖితపూర్వకంగా ఆయన నివేదించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందన్నారు. రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని రఘురామ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన రుణాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఆర్థిక దివాళా పరిస్థితుల్లో ఏపీలో రాష్ట్రపతి పాలన అనివార్యమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మి నారాయణ ఇంటిపై సీఐడీ పోలీసుల సోదాలు, కేసుల నమోదు కక్ష్య సాధింపు మాత్రమేనని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.  లక్ష్మీ నారాయణ ఇంట్లో సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ  వేమూరి రాధాకృష్ణ  ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో పోలీసులు ఆర్కేను ఉండమని చెప్పిన విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తిరిగి రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా కక్ష్య సాధింపేనన్నారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులను దారుణంగా వాడుకుంటోందని రఘురామ విమర్శించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవనే విషయం పోలీసులు గుర్తు పెట్టుకోవాలన్నారు. తప్పులు చేసే పోలీసులు కూడా శిక్షలకు సిద్ధంగా ఉండాలన్నారు. రిటైర్డ్ జడ్జి చంద్రుడు రాష్ట్ర ప్రభుత్వానికి మరో అంబాసిడర్‌గా తయారయ్యారన్నారు. న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా చంద్రుడు మాట్లాడారని, ఆయన వ్యవహారంపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు లేఖ రాస్తానన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ఏపీ ప్రభుత్వం అందరికీ హనీ చేస్తోందని రఘురామ రాజు అన్నారు.

Related Posts