YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఉస్మానియా ఆస్ప‌త్రి లో సీటీ స్కాన్‌, క్యాథ్ ల్యాబ్‌ ప్రారంభించిన హ‌రీశ్‌రావు

ఉస్మానియా ఆస్ప‌త్రి లో సీటీ స్కాన్‌, క్యాథ్ ల్యాబ్‌ ప్రారంభించిన హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్ డిసెంబర్ 14
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఇవాళ ఉస్మానియా ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆస్ప‌త్రిలో కొత్త‌గా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ను, క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించారు. క్యాథ్ ల్యాబ్‌ను రూ. 8 కోట్లతో ఏర్పాటు చేశారు. అగ్నిమాప‌క యంత్రం, ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను కూడా ప్రారంభించారు. ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఇటీవ‌లే గాంధీ ఆస్ప‌త్రిలో సీటీ స్కాన్‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. నిలోఫ‌ర్ హాస్పిట‌ల్‌లో రూ. 2 కోట్ల వ్య‌యంతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, నియోనాట‌ల్ స్కిల్ ల్యాబ్‌ను మంత్రి హ‌రీశ్‌రావు సోమ‌వారం ప్రారంభించారు.

Related Posts