YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి

హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి

బెంగళూరు డిసెంబర్ 15
భారత తొలి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌కు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వరుణ్ సింగ్‌.. బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బుధవారం నాడు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది.ఈ నెల 8వ తేదీన జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వరుణ్ సింగ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులు సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు కూనూర్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 13 మంది మరణించారు.

Related Posts