YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కలెక్టర్ కార్యాలయంలో సీఎస్ సోమేశ్ కుమార్

కలెక్టర్ కార్యాలయంలో సీఎస్ సోమేశ్ కుమార్

రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. జీ.ఓ. నెంబర్ 317 అమలుపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ బదిలీల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చీఫ్ సెక్రటరీ ని కోరగా, ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని సి.ఎస్. సోమేశ్ కుమార్ వారికి హామీ నిచ్చారు.ఈ సందర్బంగా రంగారెడ్డి కలెక్టర్ ఆమాయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, తిరుపతి రావు  లు కూడా ఉన్నారు

Related Posts