YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తిరుపతి సభకు బీజేపి మద్దతు

తిరుపతి సభకు బీజేపి మద్దతు

తుని
తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంటలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పర్యటించారు. గుజరాత్ రాజధాని అహమ్మాబాద్ లో  ఆర్గానిక్ వ్యవసాయం పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని తేటగుంట రైతు భరోసా కేంద్రంలో రైతులతో పాటు అయన వీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం అట్టడుగున ఉన్న రైతులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. తిరుపతి లో జరిగే రైతులు ఏర్పాటు చేసే సభకు బీజేపి పూర్తి మద్దతు వుంటుందని అన్నారు. పార్టీ తరపున కన్నా లక్ష్మీనారాయణ హజరవుతారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంది. స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అన్యాయం జరగదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గత ప్రభుత్వాలే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చాయి. రాష్ట్రంలో ఉన్న  ప్రభుత్వం వల్లే చక్కర కర్మాగారాలు  ఈ దుస్థితని అయన అన్నారు.

Related Posts