YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

వరంగల్
ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్  జనగామ జిల్లాలో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశానికి జనగామ టి.ఆర్.ఎస్ పార్టీ నూతన కార్యాలయం వద్ద స్థలాన్ని  రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు ,  సత్యవతి రాథోడ్, ఎంపిలు పసునూరి దయాకర్,  కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, బండ ప్రకాష్, ఎమ్మేల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, మాజీ ఎమ్మెల్సీ బోడేకుంటి వెంకటేశ్వర్లు, చైర్మన్లు పాగాల సంపత్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, మర్రి యాదవ రెడ్డి, నాగుర్ల వెంకన్న, మార్నెని రవిందర్ రావు,  గాంధీ నాయక్, ఎడవెల్లి కృష్ణా రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, సంపత్, సత్యమూర్తి, ఉపేందర్, ఇతర నాయకులు శుక్రవారం పరిశీలించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సభ విజయవంతం చేయాలని, సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.  పార్కింగ్ స్థలాల్లో వాహనాలకు పక్కా ప్లాన్ చేయాలని, సభ అలంకరణ, వసతుల కల్పన అంశాలపై చర్చించారు.

Related Posts