YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

న్యాయపరంగా అమరావతే రాజధాని

న్యాయపరంగా అమరావతే రాజధాని

తిరుపతి
ఇది దగాపడ్డ రైతుల సభ, రాజకీయ సభకాదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం  హైదరాబాదు నుంచి అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర సభకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న నరసరావుపేట వైసీపీ రెబల్ ఎంపీకి అమరావతి రాజధాని జేఏసీ రైతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ సభ తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడే వారు ఎవరూ ఉండరని చెప్పారు. న్యాయపరంగా 100 శాతం అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు అరువు మాటలని చెప్పారు. సత్తిబాబు చెడ్డవాడు కాదు.. మంచి వాడని తాను అనడంలేదన్నారు. మనం జాలి పడాలి తప్ప బొత్స మాటలువిని బాధపడకూడదని రఘురామ తెలిపారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతికి రఘురామ బయలుదేరి వెళ్లారు.

Related Posts