YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

30 ఏళ్లలో పీక్స్ కు చేరనున్న జనాభా

30 ఏళ్లలో పీక్స్ కు చేరనున్న జనాభా

న్యూఢిల్లీ, డిసెంబర్ 18,
మన దేశ జనాభా మరో 30 ఏళ్లకు పీక్స్ కు చేరబోతోంది. భారతదేశ జనాభా 2050 నాటికి1.6 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారతదేశ జనాభా వృద్ధి రేటు క్షీణించడం ప్రారంభించే సంవత్సరం ఇది. ఈ శతాబ్దపు ప్రారంభంలో భారతదేశ జనాభా దాదాపు ఒక బిలియన్. ప్రస్తుతం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా యువ భారతావనిగా గుర్తింపు పొందింది. భారతదేశ సగటు వయస్సు దాదాపు 28.5 సంవత్సరాలు. ఇక అంచనాల ప్రకారం 2050 నాటికి, భారతదేశ జనాభా చైనా కంటే 250 మిలియన్లు ఎక్కువగా ఉంటుంది.భారతదేశం 2050 నాటికి తక్కువ యువత ఉన్న దేశంగా ఉంటుందని నమ్ముతారు. కానీ జనాభా శాస్త్రవేత్తల ప్రకారం.. భారతదేశ జనాభా ఊహించిన దానికంటే వేగంగా వృద్ధాప్యం చెందుతోంది. అంటే రాబోయే కాలంలో భారతదేశం త్వరగా పాతబడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ధనిక దేశాల జాబితాలో చేరేంత వరకు యువ దేశంగా ఉండగలదా అన్నది పెద్ద ప్రశ్న. నిపుణులు ఈ దశాబ్దం ప్రారంభంలో చైనాకు ఇదే ప్రశ్నను లేవనెత్తారు.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, సగటు భారతీయ మహిళకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. 1960లో భారతదేశ జనాభా వృద్ధి రేటు 2%. ఈ సమయంలో భారతదేశంలో పెద్ద ఎత్తున కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించారు. తరువాతి దశాబ్దాలలో, గృహ ఆదాయాన్ని పెంచడం, శిశు మరణాలను తగ్గించడం..మహిళా సాధికారత తర్వాత, ఇప్పుడు భారతదేశ పట్టణ జనాభా వృద్ధి రేటు 1.6 శాతంగా ఉంది. ఇది అమెరికా వృద్ధి రేటుతో సమానం.ఈ శతాబ్దం ప్రారంభంలో చైనా కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. చైనాలో వన్ చైల్డ్ పాలసీని అమలు చేశారు. మరోవైపు వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటు కారణంగా చైనాలో సంపన్న దేశాల కేటగిరీలోకి వచ్చేసరికి వృద్ధుల దేశంగా మారుతుందా అనే ప్రశ్న తలెత్తింది.సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారం, భారతదేశంలో కళాశాల గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం రేటు 19.3%. ఇది జాతీయ సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం, భారతదేశంలోని ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు మాత్రమే వర్క్‌ఫోర్స్‌లో ఉన్నారు. ఈ విషయంలో వెంటనే జాగ్రత్తలు తీసుకోకుంటే ఆర్థిక వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉంది

Related Posts