YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

19 కాదు.. 23 నుంచి కేసీఆర్ టూర్

19 కాదు.. 23 నుంచి కేసీఆర్ టూర్

హైదరాబాద్, డిసెంబర్ 18,
తెలంగాణ ముఖ్యమంతరి కే.చంద్రశేఖర్ రావు జిల్లాల పర్యటనలో స్వల్ప మార్పులు జరిగినట్లు సమాచారం. ఈ నెల 19 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల పర్యటన వాయిదా పడింది. ఈ నెల 23 నుంచి ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటిస్తారు. 23న వనపర్తి జిల్లాలో సీఎం పర్యటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో నాలుగు జిల్లాల్లో సీఎం పర్యటించారు. గురువారం వనపర్తిలో పర్యటించనున్న సీఎం.. నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కొత్తగా నిర్మించిన మార్కెట్ యార్డును, రెండు పడకల గదుల ఇళ్లను కూడా ప్రారంభిస్తారు. వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాల, కర్నెతండా ఎత్తిపోతల, వేరుశనగ పరిశోధనా కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్ రిజిస్ట్రార్, నీటి పారుదల శాఖ సీఈ కార్యాలయాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అలాగే. జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్… పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 19న వనపర్తి జిల్లాలో, 20న జనగామ జిల్లాల పర్యటనకు వెళ్లాలని భావించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు బహిరంగ సభల్లోనూ పాల్గొంటారని సీఎంవో కార్యాలయం తెలిపింది. తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. కాగా, ఇవాళ దళితబంధుతో పాటు పలు అంశాలపై కలెక్టర్లతో భేటీకానున్నారు. దళితబంధు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. ప్రగతిభవన్‌లో జరిగే సమావేశంలో మంత్రులు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీనియర్‌ అధికారులు పాల్గొననున్నారు. ఇక వికారాబాద్‌, జనగామతో పాటు త్వరలోనే పలు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

Related Posts